Pages

1, డిసెంబర్ 2010, బుధవారం

నీ పుట్టుక కూడా నీ రియల్ ఎస్టేటే...

లెక్చరర్ మల్లయ్య కూతురు ఒకరోజు సాయంత్రం వాళ్ల కాలనీలోనే ఉన్న ఫ్రెండ్ను కలవడానికి వెళ్లింది. చీకట్లో తిరిగివచ్చేటప్పుడు అదే కాలనీలో ఉండే ఒక కుర్రాడు పిల్ల జడ లాగాడు. బదులుగా పిల్ల చెప్పుతీసుకొని వాడి చెంప మీద కొట్టింది. ప్రతీకారంగా వాడు ఆమె బుగ్గ కొరికి పారిపోయాడు. ఇదితెలిసి మల్లయ్య కొడుకు తన ఫ్రెండ్స్ను తీసుకొని కుర్రాడి ఇంటికి పోయి మొత్తంతుక్కుతుక్కు చేశాడు. కుర్రాడు హాస్పిటల్ పాలయ్యాడు. కుర్రాడి తల్లిదండ్రులు వెంటనే మల్లయ్యకొడుకు మీద కేసు పెట్టారు. దీనికి విరుగుడిగా మల్లయ్యవాళ్లు కుర్రాడి మీద రేప్ అటెంప్ట్ కేసుపెట్టారు.

ఇదీ జరిగింది.
‌ ‌ ఇందులో ఇక మీదట జరగాల్సిందంతా లీగల్ బ్యాటిలే. కాని మన దేశంలో అలా జరగదు. వెంటనే కథ వ్యక్తుల దగ్గరకువస్తుంది. ఇంకా కరెక్టుగా చెప్పాలంటే కులం దగ్గరకు వస్తుంది.
చూశారా- కులం తక్కువ వాళ్లు కాబట్టే తమ అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ జరిగిందని కేసు పెట్టారు. అదే మనమైతేపెడతామా? అని అవతలి పక్షం వాళ్లు అనడం మొదలెట్టారు. కాలనీ రెండు వర్గాలుగా
చీలిపోయింది. మల్లయ్య మనసు నీరు అయిపోయింది.
అరె.... ఇంతా చేసి తిరిగి కులం దగ్గరకే వచ్చి చేరామే అని బాధ పడ్డాడు.
పాతికేళ్ల
క్రితం కాలనీలో ఏమీ ఏర్పడక ముందు స్థలం కొని ఇల్లు కట్టుకున్నాడు మల్లయ్య. అతడి భార్య టీచరు. ఇద్దరూ కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. అక్కడ చేరాక, ఇరుగుపొరుగు వారితో స్నేహం చేశారు. పిల్లలు కూడా కాలనీవారికి దగ్గరయ్యారు. కాని ఇప్పుడీ గొడవ వల్ల ఎడం పెరిగింది.

ఒకప్పుడు మల్లయ్య దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు దేవుడి దయ వల్ల అంతా ఉంది. ఆస్తి ఉంది.
అయినప్పటికీ
- చాలా విషయాలు నిర్ణయిస్తున్నది కులమే అని అతనికి అర్థమవుతూ ఉంది. నిన్న మొన్నటి దాకా అదేకాలనీలోని ఒక మిత్రుడు మల్లయ్యతో ఎంతో సఖ్యంగా మెలిగేవాడు. అతడు బిల్డర్. రియల్ ఎస్టేట్ రంగం బాగాఉన్నప్పుడు బిల్డర్ కూతురికీ, మల్లయ్య కొడుక్కీ పెళ్లి జరిగితే బాగుంటుందని
ఇరువర్గాల
వాళ్లూ అనుకున్నారు. కాని ఈలోపు బిల్డర్ దెబ్బ తిన్నాడు. తేడా వచ్చింది డబ్బు విషయంలో మాత్రమే. కాని కులం రోల్ ప్లే చేసింది.

ఎలాగూ ఆస్తి చెడింది, నీ కూతురిని కులం తక్కువ వాళ్ల అబ్బాయికే ఇచ్చి కులం కూడా చెడు అని ఇరుగుపొరుగువాళ్లు అనడం మొదలెట్టారు.
బిల్డర్
కి అహం అడ్డం వచ్చింది. ధైర్యం లేకపోయింది. కుర్రాడికేం చాలా మంచి అబ్బాయి అని చెప్పలేకపోయాడు. మల్లయ్యను తప్పించుకొని తిరగడం మొదలుపెట్టాడు. తక్కువకులం వాడికి డబ్బు ఎక్కువై ఎక్కువ కులం వాడికిడబ్బు తక్కువైనా సరే ఎక్కువ కులం వాడిదే పైచేయి!
లోపల కాలనీలోని చుట్టుపక్కల స్థలాలన్నీ రేటు పెరిగిపోయాయి.
మల్లయ్య కట్టుకున్న ఇల్లు మాత్రం అలాగే ఉంది.

రియల్ ఎస్టేట్లో గమ్మత్తేమిటంటే ఖాళీ జాగాకు ఉన్న డిమాండు కట్టిన భవంతికి ఉండదు. ఖాళీ జాగా ఉంటే లోన్లుసులభంగా దొరుకుతాయి. వీలుని బట్టి కట్టుకోవచ్చు. ఇష్టమైనట్టుగా కట్టుకోవచ్చు. అదే కట్టిన ఇల్లయితే ఇప్పుడు లైఫ్ఎంత ఉంది, ఇక మీదట ఎంత ఉంటుంది, వాస్తు ఉందా లేదా అని ఒకటే గొడవలు.

పాపం మల్లయ్య ఎంతో ఇష్టంగా ఇల్లు కట్టుకున్నాడు. అతడి ఇంట్లో వేయని మొక్క లేదు. పెంచని
కూరగాయ లేదు. పూలతో కాయలతో అతడు కాలనీలో ఎన్నో అనుబంధాలను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. మల్లయ్యఏమంటాడంటే- శ్రమ సంస్కృతి నుంచి వచ్చిన వాళ్లకు భూమి వ్యాపార వస్తువు కాదు. భూమిని వ్యాపారంగా చూసేవాడుదానిని కొని తనకు సంబంధం లేదన్నట్టుగా పడేస్తాడు. దాని రేటు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రేటు వచ్చాకఅమ్మేసి ఇంకోచోట మళ్లీ ఇంకో స్థలం కొని పడేస్తాడు. సోమరిపోతుల పని అది.

మల్లయ్య అలా చేయలేకపోయాడు. అతడి దృష్టిలో భూమి అంటే ఇల్లు. లేదంటేపంటలు పండే పొలం. అందుకే అతడు ఇంకొన్ని చోట్ల కొన్ని ప్లాట్లు కొని పడేయలేదు. ఇప్పుడు ఇంటిని అమ్మేసి వేరే చోటుకు వెళదామంటే ఇంటికి అనుకున్న రేటురావడం లేదు. తాము కొనాలనుకున్న చోట స్థలమూ రావడం లేదు. పెద్ద ఇరకాటం.
మల్లయ్య ఆలోచించాడు.
దీనికి విరుగుడు ఏమిటి? ఇల్లు మారడమా; ఇంకో చోటుకు వెళ్లడమా? అనేది తర్వాతవిషయం. తన మానవసంబంధాలు పునరిద్ధరింప
బడాలంటే
, పైకులం వాళ్లయినా సరే- వారితో సరిసమానంగా తాను ఉండాలంటే, తనపిల్లలూ ఉండాలంటే తమకు తప్పనిసరిగా ఉండాల్సిన రియల్ ఎస్టేట్ ఏమిటి? కాలనీలో అయినా ఉండేలా తమకు అర్హత కలిగించే రియల్ ఎస్టేట్ ఏమిటి?
చదువే!

చదువు- కింద కులాల వాళ్లకి అతి పెద్ద రియల్ ఎస్టేట్. చదువుకున్నవాడినే సమాజం కులానికి అతీతంగాగౌరవిస్తుంది. హోదా ఇస్తుంది. అధికారం ఇస్తుంది. అతడితో సంబంధాలు కలుపుకోజూస్తుంది. ఇంకా చెప్పాలంటే అతణ్ణిమనిషిగా కన్సిడర్ చేస్తుంది. అదే పెద్ద కులాల వారికైతే? వారికి వారి కులమే ఒక రియల్ ఎస్టేట్. తరతరాల ఆస్తి. అదివారికి ఏదో ఒక విధంగా వడ్డీ చెల్లిస్తూనే ఉంటుంది.

అవును. కులం చెరిగిపోవాలంటే చదువు పెరగాలి అనుకున్నాడు మల్లయ్య. ఇంతవరకూ అతడు తన సొంత పిల్లలచదువు గురించే శ్రద్ధ వహించాడు. ఇక మీదట అలా ఉండడు. తమ కుటుంబాల్లోని ప్రతి ఒక్కరూ బాగా చదువుకునేలాచూస్తాడు. అందుకు అవసరమైన సహాయం చేస్తాడు. గట్టిగా ప్రయత్నిస్తాడు.

కొత్త అవగాహనతో మల్లయ్య ప్రయాణం మళ్లీ మొదలయ్యింది.
కథ ముగిసింది.
రచయిత బిఎస్ రాములు రాసిన ఆలోచనాత్మక కథరియల్ ఎస్టేట్’. బాధ తెలిసిన వాడు నొప్పి
తెలిసేలా రాసిన కథ ఇది. బహుశా పాఠకులను ఉలికిపాటుకు గురి చేసే కథ. దీనిని చదివిన పాఠకుడు పక్కనఉన్నవారితో చర్చకు దిగక మానడు.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నారెవరో.
కాని, భారతదేశంలో మానవ సంబంధాలన్నీ కుల సంబంధాలే.
వాటి నడుమ ఉన్న ఘర్షణను రియల్ ఎస్టేట్ రంగంతో ముడిపెట్టి విశదపరిచిన గట్టి కథ, రియల్ కథరియల్ ఎస్టేట్’.
- సాక్షి ఫ్యామిలీ

బిఎస్ రాములు: కథను వెర్రిగా అభిమానించి భుజాన వేసుకొని తిరిగే ప్రముఖ రచయిత. చాలామంది శిష్యులనుతయారు చేశారు. లెక్కకు మించి కథలు రాశారు. స్వస్థలం కరీంనగర్ జిల్లా జగిత్యాల. ‘పాలువీరి తొలి కథా సంపుటి. ఇంకో అరడజను పుస్తకాలున్నాయి. నివాసం హైద్రాబాద్. ఫోన్: ౯౩౯౧౦౩౬౯౮౭


సాక్షి, డైలీస్టోరీ, ప్రతి రోజూ కథా పరిచయం నుంచి
గురువారం :
02/12/2010

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి